కేంద్రం ఆధార్ పథకాన్ని మొదలు పెట్టినప్పటి నుండి దాని అమలు పై రకరకాల వాదనలు వినబడుతూనే ఉన్నాయ్. ఉన్న అన్ని గుర్తు నిర్దారణ పద్ధతులని ఓకే పద్ధతికి అనుసంధానం చెయ్యాలనే ఉద్దేశంతో కేంద్రం ఆధార్ ని తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం తాలూకు ఏ పనికైనా ఆధార్ కార్డు తప్పని సరి అన్న ప్రభుత్వ వాదనని సుప్రీమ్ కోర్ట్ చాలా సార్లు తప్పుపట్టింది. ఆధార్ వాడకం పై చాలా మంది అనుమానాలుకూడా వ్యక్తం చేసారు.అయితే కేంద్రం మాత్రం ఈ విషయం పై చాలా మొండిగా ఉంటూ, చివరికి సామాన్యుల కొరకు తాము ఇచ్చే పథకాల సదుపాయాలు పొందాలంటే కూడా ఆధార్ తప్పనిసరి అనేసింది. ఈ దిశగా సాగుతున్న ఆధార్ తాలూకు వాదనల్లో భాగంగా సుప్రీమ్ కోర్ట్ తాజాగా ఓ తీర్పిచ్చింది. “కేంద్రం చెప్పినట్టుగా కేంద్ర పథకాల విషయం లో ఆధార్ ఏం తప్పనిసరి కాదని” చెప్పింది. అయితే టాక్స్ మరియు బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ వంటి విషయాల్లో మాత్రం అవసరేమని అనింది.
జూన్ 30 నుండి బయోమెట్రిక్ గుర్తింపు కార్డులని కూడా అమలు పరుస్తామని చెప్పింది కేంద్రం. చూద్దాం జనమేమంటారో.